లుథియానా: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచిన కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ చౌదరి(76) గుండెపోటుతో మరణించారు. జలంధర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన శనివారం యాత్రలో నడుస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను పగ్వారాలోని ఓ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాహుల్ గాంధీ వెంటనే యాత్రను ఆపేసి దవాఖానకు వెళ్లి, చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.