న్యూఢిల్లీ: సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Delhi | Congress MP Rahul Gandhi pays tribute to former Union minister Sharad Yadav, who passed away last night pic.twitter.com/9SbWYoKVGF
— ANI (@ANI) January 13, 2023
శరద్ యాదవ్ మృతిపట్ల ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోదరుడు శరద్ యాదవ్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ నుంచి తాను, శరద్ యాదవ్, దివంగత ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ సోషలిజం రాజకీయాలను నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో శరద్ యాదవ్తో తాను గొడవపడ్డాను. కానీ తామిద్దరిమధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికీ అవి తమ సంబంధాలను దెబ్బతీయలేదని ట్విట్టర్ వేదికగా లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.
अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में।
शरद भाई…ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg
— Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023
ఇక సోషలిస్టు యోధుడి మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి శరద్ యాదవ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సోషలిస్టు దిగ్గజం జయప్రకాశ్ నారాయణ్కు అనుచరుడైన శరద్యాదవ్.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏడుసార్లు లోక్సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2003లో బీహార్ సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన జనతాదళ్(యునైటెడ్)కు తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2016 వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం నితీశ్తో పొసగకపోవడంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు.