గువహటి : అసోంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలో కుల గణన (Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల పురోగతి కోసం బిహార్, రాజస్దాన్ తరహాలో అసోంలో కుల గణన నిర్వహించాలని ఆయన కోరారు.
కాగా బిహార్లో నిర్వహించిన కుల గణన నివేదికను సీఎం నితీష్ కుమార్ అక్టోబర్ 2న విడుదల చేసిన సంగతి తెలిసిందే. బిహార్లో కుల గణన ఆధారంగా ఆ రాష్ట్రంలో ఓబీసీ, ఈబీసీ జనాభా 63 శాతం కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 84 శాతంగా వెల్లడైంది.
ఇక బిహార్ ప్రభుత్వం కుల గణన (Caste Census) వివరాలు విడుదల చేసిన క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వారి జనాభా ఆధారంగా హక్కులను దక్కేలా చూడాలని రాహుల్ పేర్కొన్నారు.
Read More :
Afghanistan | వరుస భూకంపాలతో గజగజ వణికిన అప్గానిస్థాన్.. 2000 పెరిగిన మృతుల సంఖ్య