కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్యాగ్రహానికి పూనుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీసీ శర్మ, జితు పట్వారీ, కునాల్ చౌదరీలు ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లతో నిరసనకు దిగారు. ప్రధాని మోదీ వెంటనే ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.