లూథియానా: అతనోపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ మధ్యే బీజేపీలో చేరాడు. పట్టుమని వారంకూడా కాకముందే సొంత గూటికి చేరాడు. ప్రస్తుత రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమైపోయాయి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఎన్నికల సమీపిస్తున్న వేల ఇలాంటి చేరికలు మరింత జోరందుకుంటాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈ సిత్రం చోటుచేసుకుంది.
బల్విందర్ సింగ్ లద్దీ పంజాబ్లోని హర్గోవింద్పూర్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఎన్నికల సమీపిస్తుండటంతో గత వారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆరు రోజులు గడవకముందే సొంత గూటికి చేరారు. ఆదివారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇన్చార్జ్ హరీశ్ చౌదరి సమక్షంలో మూడు రంగుల కండువా కప్పుకున్నాడు.
అయితే బీజేపీలో చేరిన సందర్భంగా పలువురు అభినందిస్తూ చేస్తిన ట్వీట్లు ఇంకా బల్విందర్ టైమ్లైన్లో ఇంకా ఉన్నాయి. ఆయన వాటికి రీట్వీట్ కూడా చేశారు. బలం పెంచుకుందామనుకున్న బీజేపీ సంతోషాన్ని ఆరు రోజుల్లో మాయం చేశారు. బల్విందర్తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ప్రతాప్ బజ్వా సోదరుడు ఫతేహ్ ఎమ్మెల్యే జంగ్ సింగ్ బజ్వా కూడా కమల దళంలో చేరారు. మరి ఆయన ఎన్నిరోజులు ఆ పార్టీలో ఉంటారో చూడాలి మరి!