పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ను కాంగ్రెస్ నేత సిద్దూ పొగడ్తలతో ముంచెత్తారు. పంజాబ్లో ఓ సరికొత్త మాఫియా వ్యతిరేక యుగం ప్రారంభమైందని ట్వీట్ చేశారు. పంజాబ్లో సరికొత్త యుగం ఆరంభమైంది. ఓ సరికొత్త మాఫియా వ్యతిరేక యుగం షురూ అయింది. ఎవరూ ఊహించని వ్యక్తి, సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. ప్రజల్లో చాలా ఆశలున్నాయి. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడిచే రోజులను మళ్లీ తీసుకొస్తున్నారు భగవంత్ మాన్ అంటూ సిద్దూ ట్విట్టర్ వేదికగా పొగిడారు.
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మాన్చే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.