న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో (anti-Sikh riots case) కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్, ఇతర నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. 1984లో సుల్తాన్పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్తో సహా ఐదుగురు నిందితులపై కేసు నమోదైంది. అల్లర్ల సమయంలో నిందితులు గురుద్వారాకు నిప్పంటించినట్లు వారిపై అభియోగాలు మోపారు. విచారణ సమయంలో ఇద్దరు నిందితులు చనిపోయారు.
కాగా, గత నెలలో ఈ కేసుపై విచారణ సందర్భంగా అల్లర్లు ప్రేరేపించిన ప్రాథమిక వ్యక్తిగా సజ్జన్ కుమార్ను కోర్టు గుర్తించింది. హింసాత్మక మూకలో ఆయన కూడా ఉన్నట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలోని సిక్కుల ఇళ్లను తగులబెట్టాలని ఆ గుంపు భావించినట్లు కోర్టు అభిప్రాయపడింది. అయితే బుధవారం నాటి తీర్పులో నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్పై విచారణను అక్టోబర్ 13కు రోస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.