న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గద్దె నెక్కిన బీజేపీ.. ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్యూల్లో కాంట్రాక్టు నియామకాలు దాదాపు రెట్టింపు అయ్యాయని, ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కును హరించడం కాదా? అని ప్రశ్నించారు.