ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా శ్రమించారని పేర్కొన్నాయి. పార్టీ కోసం వాళ్లందరూ కష్టపడ్డారని, ప్రజల సమస్యలపై విస్తృతంగా పోరాటాలు చేశారని, అయినా.. పార్టీ ఓడిపోయిందన్నారు. కార్యకర్తల శ్రమ ఓట్ల రూపంలోకి మారలేదని ప్రియాకం గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇక రెండో ట్వీట్ కూడా ప్రియాంక గాంధీ చేశారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడానికి తాము సిద్ధంగానే వుంటామని హామీ ఇచ్చారు. పాజిటివ్ అజెండా, అభివృద్ధి అన్న కోణాన్నే కాంగ్రెస్ ఫాలో అవుతుందని ఆమె స్పష్టం చేశారు.