పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాపై ఆ పార్టీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెయినర్స్ జాబితా చాలా ఘోరంగా వుందని, ఆ జాబితాలో ఉన్న వారి భార్యలు కూడా వారు చెబితే ఓటు వేయరంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే ఎవరో చెప్పినంత మాత్రాన భార్యలు కూడా అటే వైపే ఓటు వేయరని కూడా వ్యాఖ్యానించారు. అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తన పేరు లేకపోవడం తన తప్పేమీ కాదని, ఆ బాధ్యత అధిష్ఠానానిదే అని అన్నారు. అయితే మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితుడైన కారణంగానే తనను స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో పేరు చేర్చలేదా? అని ప్రశ్నించగా… కెప్టెన్ అమరీందర్ సింగ్ కుటుంబానికి, తన కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలున్నాయని మనీశ్ పేర్కొన్నారు. ఈ కాలంలో కాదని, గత 50 సంవత్సరాలుగా కెప్టెన్ అమరీందర్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలున్నాయన్నారు.