న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్నికాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే స్వాగతించారు. ఇది రైతుల విజయమని ఆయన అభివర్ణించారు. సాగు చట్టాలను వెనక్కితీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసిందని, ముందుగానే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే వందలాది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారమని వ్యాఖ్యానించారు.
కాగా సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఆందోళనను విరమించి ఇండ్లకు తిరిగివెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. రైతులకు ఇబ్బందులు కలిగించినందుకు క్షమించాలని ఆయన పేర్కొన్నారు.