Parliament Building | న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ నిర్మాణ శైలి దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని వమ్ముచేసిందని కాంగ్రెస్ మండిపడింది. నూతన పార్లమెంట్ను మోదీ మల్టీప్లెక్స్గానో, మోదీ మారియట్గానో పిలవాలని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు. ‘రాజ్యాంగాన్ని మార్చకుండానే ప్రజాస్వామ్యాన్ని ప్రధాని చంపేశారు. ఈ పని కొత్త పార్లమెంట్ భవన నిర్మాణశైలి ద్వారా మరోసారి జరిగింది. ఇరు సభలు, లాబీల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. నాలుగు రోజుల్లో నాకు ఇదే కనపడింది’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఎక్స్లో సందేశాన్ని పోస్ట్ చేశారు.