న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి 10 శాతం కోటా అమలును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం ముందు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
విద్యా ఉపాధి రంగాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు కోటా అమలు చేసే రాజ్యాంగ సవరణపై ఈ నెల 7న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. రాజ్యా ంగ ధర్మాసనం 3:2 నిష్పత్తితో ఆ కోటా ను సమర్థించింది. అయితే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తూ.. ఇతర కులాల పేదలను మినహాయించే ఈ సవరణ చెల్లదని, తీర్పును సమీక్షించాలని కాంగ్రెస్ నేత పిటిషన్లో పేర్కొన్నారు.