బెంగళూరు : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు సమన్లు జారీ చేసింది. అయితే, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే తన రాజ్యాంగ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు సమయం అడ్డు వస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు మరికొద్ది రోజుల్లో కర్నాటకలో అడుగుపెట్టనున్న పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ మధ్య నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు.
ఈడీ కావాలనే నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా.. విధులు నిర్వర్తించకుండా తనను ఈడీ వేధిస్తోందంటూ ట్వీట్ చేశారు. కర్నాటకలో బీజేపీ అవినీతిని నిరసిస్తూ ‘40శాతం సర్కారా.. బీజేపీ అంటే భ్రష్టచార’ పేరుతో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘జోడో యాత్ర’ కేరళలో సాగుతుండగా.. అక్టోబర్ 1న కర్నాటకలోకి ప్రవేశించనున్నది.
#BharatJodoYatra ಹಾಗೂ ವಿಧಾನಸಭಾ ಅಧಿವೇಶನ ನಡೆಯುತ್ತಿರುವ ಮಧ್ಯೆಯೇ ಮತ್ತೊಮ್ಮೆ ಇಡಿ ನನಗೆ ಸಮನ್ಸ್ ನೀಡಿದೆ.
ನಾನು ಸಹಕರಿಸಲು ಸಿದ್ಧ ಆದರೆ ಈ ಸಮನ್ಸ್ ನೀಡಿರುವ ಸಮಯ, ಹಾಗೂ ಮೇಲಿಂದ ಮೇಲೆ ನೀಡುತ್ತಿರುವ ಕಿರುಕುಳದಿಂದಾಗಿ ನನ್ನ ಸಾಂವಿಧಾನಿಕ ಮತ್ತು ರಾಜಕೀಯ ಕರ್ತವ್ಯಗಳನ್ನು ನಿರ್ವಹಿಸಲು ತೊಂದರೆಯಾಗುತ್ತಿದೆ.— DK Shivakumar (@DKShivakumar) September 15, 2022