రాయ్పూర్ : పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ సుంకం తగ్గించడాన్ని లాలీపాప్గా కాంగ్రెస్ శుక్రవారం అభివర్ణించింది. యూపీఏ ప్రభుత్వం తరహాలో ఎక్సైజ్ సుంకాన్ని రూ 30 నుంచి రూ 9కి ఎన్డీఏ ప్రభుత్వం తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగివస్తాయని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు.
సామాన్యుడికి ఉపశమనం కలిగించే రీతిలో ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదని మరో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు సరిపోదని పెట్రో భారాలు మరింతగా తగ్గాలని వ్యాఖ్యానించారు. ఎల్పీజీ రేట్లను కూడా గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా పెట్రోల్పై లీటర్కు రూ 5, డీజిల్పై రూ 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం తగ్గించిన సంగతి తెలిసిందే.