న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ విజభనకు దారితీసిన పరిస్థితుల పేరు తో బీజేపీ ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యం గా తయారుచేసింది. బీజేపీ వీడియోపై కాంగ్రెస్ మండిపడింది. ఆగస్టు 14ను విభజన భయానకాల సంస్మరణ దినంగా పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు అసలు ఉద్దేశం బయటపడిందని, బాధాకరమైన ఘటనలను కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నదని ఎంపీ జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి రోజుల సావర్కర్లు, జిన్నాలు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అన్నారు.