న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 104వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తి స్థల్లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రాంర్థనల్లో పాల్గొన్నారు.