షిల్లాంగ్ : మేఘాలయలో 17 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మేఘాలయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేమ్స్ లింగ్డో, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మానస్ దాస్ గుప్తా పార్టీకి గుడ్బై చెప్పారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు రాజీనామా లేఖ పంపానని జేమ్స్ లింగ్డో వెల్లడించారు. గత 33 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టానని, తన తండ్రి మేఘాలయాలో పార్టీని పటిష్టపరిచినా కాంగ్రెస్ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని అన్నారు.