న్యూఢిల్లీ, మార్చి 25: పరువు నష్టం కేసులో శిక్షపడి, ఎంపీగా అనర్హతను ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం ‘సంకల్ప సత్యాగ్రహం’ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ దీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. కాంగ్రెస్ వర్గాలు అన్ని రాష్ర్టాలు, జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట ఈ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో రాజ్ఘాట్లో జరిగే దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొంటారు.