న్యూఢిల్లీ: రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘మౌన సత్యాగ్రహం’ నాలుగు రాష్ట్రాల్లో ఆగిపోయింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో మౌన సత్యాగ్రహాన్ని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే ఆ నాలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16న మౌన సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
పరువునష్టం కేసులో కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను ఇటీవల గజరాత్ హైకోర్టు సమర్థించింది. దాంతో లోక్సభ సెక్రెటేరియట్ రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో గాంధీ విగ్రహాల ముందు మౌన సత్యాగ్రహం పేరిట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.