న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం నుంచి మరో పన్ను నోటీసు వచ్చిందని హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రూ.1,745 కోట్ల పన్ను డిమాండ్తో నోటీసు పంపిందని తెలిపాయి. తాజా నోటీసుతో కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ ఇచ్చిన పన్ను నోటీసుల డిమాండ్ మొత్తం రూ.3,567కి చేరింది. తాజా నోటీసులు 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.663 కోట్లు, 2015-16కు రూ.664 కోట్లు, 2016-17 ఏడాదికి రూ.417 కోట్ల పన్ను వసూలుకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీ శాఖ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి రూ.135 కోట్లు విత్డ్రా చేసుకొన్నది. దీనికి ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.