కాంగ్రెస్ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా కొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఎక్కడా… దీని గురించి ప్రస్తావన జరిగినట్లు కూడా మీడియాలో రాలేదు. కానీ.. హఠాత్తుగా గురువారం రోజు దీనిని ఏకంగా అమలు కూడా చేసేసింది అధిష్ఠానం. అదే..” ఒక నేతకు ఒకే పదవి”. ఈ రూల్ను కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ నుంచే ప్రారంభించింది. కమల్నాథ్కు ప్రస్తుతం రెండు పదవులు ఉన్నాయని, అందుకే విపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో కమల్నాథ్ రాజీనామా చేసేశారు.
మధ్యప్రదేశ్లో 2023 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ఇప్పటి నుంచి ఒకే వ్యక్తి- ఒకే పదవి అన్న ఫార్ములాతోనే అధిష్ఠానం ముందుకు సాగుతుందని హైకమాండ్ నేత ఒకరు చెప్పారు.
కమల్నాథ్ రాజీనామా.. తదుపరి నెంబర్ ఎవరిదంటే..?
మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత పదవికి కమల్నాథ్ హఠాత్తుగా రాజీనామా చేసేశారు. ఒక వ్యక్తి ఒక పదవి అన్న సూత్రం కిందనే ఆయన రాజీనామా చేశారని సమాచారం. ఇక ఈ లైన్లో రణదీప్ సూర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి టర్మ్ వస్తుందని అంటున్నారు. అధీర్ రంజన్ లోక్సభలో విపక్ష నేతే కాకుండా… పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా వున్నారు. అలాగే రణదీప్ సూర్జేవాలా జాతీయ అధికార ప్రతినిధితో పాటు కర్నాటక ఇన్చార్జీ, మీడియా ఇన్చార్జీ పదవుల్లో కూడా వున్నారు. ఇక.. వీరిద్దరికీ ఏదో ఒక్క పదవే వుంచి, మిగతా పదవులకు హైకమాండ్ తొందర్లోనే రాజీనామా చేయించనుంది.