కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ బ్రార్ను నియమిస్తూ అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భరత్ భూష్ ఆసూను ప్రకటించింది. సీఎల్పీ నేతగా ప్రతాప్ సింగ్ బాజ్వాను నియమిస్తూ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఐదు రాష్ట్రాల ఘోర ఎన్నికల పరాభవానికి బాధ్యులుగా చేస్తూ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా వున్న సిద్దూ ఈ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సోనియా గాంధీకి పంపారు.
Congress appoints party leader Amrinder Singh Brar (Raja Warring) as the Punjab Congress chief (PCC) and Pratap Singh Bajwa as the CLP leader for Punjab. pic.twitter.com/PNh8HXCvFu
— ANI (@ANI) April 9, 2022