పనాజీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పరిశీలకుడిగా సీనియర్ నేత పీ. చిదంబరంను కాంగ్రెస్ నియమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలను చిదంబరం పర్యవేక్షిస్తారు.
చిదంబరం నియామకానికి సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీకి వచ్చేఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీ కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లతో జట్టుకట్టి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.