Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నాలుగోరోజు బిశ్వనాధ్ జిల్లా నుంచి సొనిట్పూర్లోని నాగౌన్కు చేరుకునే క్రమంలో దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.
రాహుల్ గాంధీ రాకకు ముందు అదే మార్గంలో బీజేపీ మద్దతుదారులు ప్రదర్శన చేపట్టారని, జైరాం రమేష్ వాహనం సహా రాహుల్ కాన్వాయ్లోని పలు వాహనాలను వారు ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ జోడో న్యాయ్ యాత్రను కవర్ చేస్తున్న పాత్రికేయుల వాహనాలనూ బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
కాగా ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అసోం డీజీపీని ఆదేశించారు. జైరాం రమేష్ వాహనానికి అతికించిన కాంగ్రెస్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్స్ను బీజేపీ కార్యకర్తలు తొలగించారని, గ్లాస్ అద్దాలను పగులగొట్టి వాహనంపై బీజేపీ జెండాను ఉంచేందుకు ప్రయత్నించారని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ మహిమా సింగ్ ఆరోపించారు.
Read More :