జైపూర్, అక్టోబర్ 7: శాసనసభ ఎన్నికల వేళ బీహార్లో మాదిరి కులాల సర్వే నిర్వహించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఏ కుల జనాభా ఎంత ఉందో తెలిస్తే, వారి కోసం ఏం చేయొచ్చనేది తెలుస్తుంది’ అని గెహ్లాట్ అన్నారు. మరోవైపు వచ్చే నెలలో కమిషన్ సమర్పించబోయే నివేదిక అనంతరం కుల గణన సర్వే ఫలితాలపై నిర్ణయం తీసుకుంటానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.