జార్ఖండ్ : కరోనా కట్టడికి వారాంతంలో కఠిన లాక్డౌన్ అమలు చేయాలని జార్ఖండ్ నిర్ణయించింది. రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ విధించాలని జార్ఖండ్ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు స్పష్టం చేసింది.
షాపులను తెరిచి ఉంచే సమయాన్ని జంషెడ్ పూర్ మినహా ఇతర ప్రాంతాల్లో పొడిగించింది. 23 జిల్లాల్లో దుకాణాలను సాయంత్రం నాలుగు గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతిస్తామని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లో జార్ఖండ్ లో 603 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.