న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఓ యువకుడు దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్లోని అల్వాల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన తాటికొండ రవికిరణ్ తిలక్(31).. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. ముఖర్జీనగర్లో నివాసముంటూ చదువుకుంటున్నారు. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం, మౌలిక వసతుల సమస్యలను చూసిన రవికిరణ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం బ్యాట్ గుర్తు కేటాయించింది. తన స్నేహితుల సహకారంతో ఆయన ప్రచారం సైతం నిర్వహించారు. ఈ స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది.