న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం రూ.936.44 కోట్ల జరిమానా విధించింది.
అంతేకాకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా గూగుల్ తన తీరును మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఆ సంస్థకు సీసీఐ జరిమానా విధించడం వారం రోజుల్లో ఇది రెండోసారి.