బెంగళూరు, ఆగస్టు 1: వాహన బీమాపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యజమానులు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను, పర్మిట్లను రెన్యువల్ చేసుకోలేదన్న కారణంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా బీమా సంస్థలు తప్పించుకోలేవని స్పష్టం చేసింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు రెన్యువల్ చేయించుకోకపోయినా బీమా పాలసీ అమల్లోనే ఉంటుందని తేల్చిచెప్పింది. ఓ స్కూల్ బస్సు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆ బస్సు యాజమానే పరిహారం చెల్లించాలని, ప్రమాదం జరిగే నాటికి ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటూ దిగువ కోర్టు జారీచేసిన ఉత్తర్వును హైకోర్టు తోసిపుచ్చింది. పరిహారం బీమా కంపెనీనే చెల్లించాలని స్పష్టంచేసింది.