ఫతేపూర్, జూన్ 12: ఆక్సిజన్ అందక అరవై మంది పసిపిల్లలు చనిపోయిన రాష్ట్రంలో.. శవాలు గంగా నదిలో తేలిన ఉత్తరప్రదేశ్లో ఒక ఆవుకు సుస్తీ చేసిందని దాని చికిత్సకు వారంలో రోజుకో డాక్టర్ చొప్పున ఏడుగురు వైద్యులను నియమించారు. ఫతేపూర్ జిల్లా మెజిస్ట్రేట్ అపూర్వ దూబే ఆవుకు సుస్తీ చేసింది. చికిత్సకు, దాన్ని చూసుకోవడానికి జిల్లా చీఫ్ వెటర్నరీ(సీవీఓ) అధికారి ఎస్కే తివారీ ఏడుగురు వెటర్నరీ డాక్టర్లను నియమించారు. ప్రతీ రోజు ఒక డాక్టర్ పొద్దున, సాయంత్రం ఆ ఆవు దగ్గరికి వెళ్లి దాని ఆరోగ్యం ఎలా ఉందో చూసి, అవసరమైతే మందులిచ్చి రావాలి. రోజువారీ రిపోర్టును సాయంత్రంలోగా అందజేయాలి. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి.