న్యూఢిల్లీ : కశ్మీరులో చలి పులి పంజా మళ్లీ విసురుతున్నది. శనివారం కాస్త ఉపశమనం ఇచ్చినా, ఆదివారం శ్రీనగర్లో మైనస్ 4.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది శ్రీనగర్లో పగటి పూట సాధారణం కన్నా ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే రాత్రి వేళల్లో చలి విపరీతంగా ఉంటున్నది. మరోవైపు జమ్మూలో ఓ వారం నుంచి శ్రీనగర్ కన్నా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం రాత్రి ఇక్కడ 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉన్న అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో మైనస్ 5.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.