హైదరాబాద్: టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్ కటింగ్ పేరిట టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చును తగ్గించుకుంటాయి. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగాల్లో కోత విధించడంతోపాటు ఆస్తులను కూడా విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని కొన్ని మీడియా కథనాల చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. రెండేళ్లలో రూ.3,300 కోట్లను ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్ను, చెన్నై సిరుసేరిలోని 14 ఎకరాల క్యాంపస్ను విక్రయించాలని కాగ్నిజెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.
రీస్ట్రక్చరింగ్లో భాగంగా కాగ్నిజెంట్ తన వర్క్స్పేస్ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్ కల్చర్ను ఎంచుకుంది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్కల్చర్కు అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కాగ్నిజెంట్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.