న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెరిగింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.66.61కి చేరింది. గత ఐదు రోజులుగా సీఎన్జీ ధర కిలోకు రూ.6.6 పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.69.18 అయింది. గురుగ్రామ్లో రూ.74.94కు చేరింది. క్రమం తప్పకుండా ధరలు పెరుగుతుండటంతో క్యాబ్లలో ఏసీలను బంద్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్ పెట్రోల్పై మరో 90 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
ఇక న్యూఢిల్లీలో లీటరుకు 80 పైసల చొప్పన పెరగడంతో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్పై 84 పైసలు పెరగడంతో రూ.120.51కి, డీజిల్పై 85 పైసలు వడ్డించడంతో రూ.104.77కు చేరాయి. చమురు ధరలు పెరగడం గత 16 రోజుల్లో ఇది 14వ సారి.