న్యూఢిల్లీ: చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ సీఎన్జీ (CNG) ధరలను దేశీయ చమురు పంపిణీ సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి. దీంతో కీలో సీఎన్జీ ధర రూ.71.61కు పెరిగింది. అదేవిధంగా నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లో రూ.74.17కు, గురుగ్రామ్లో రూ.79.94కు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా సీఎన్జీ ధరలు అధికమయ్యాయి. కిలోకు రూ.5 వరకు పెరగడంతో ధర రూ.72కు పెరిగింది. కాగా, మార్చి 22 నుంచి 16 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మొత్తగా లీటరుపై రూ.10 వరకు వడ్డించాయి.