తిరువనంతపురం, ఆగస్టు 15: కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం లభించడమంటే మనల్ని మనం పాలించుకోవడమే కాదని, వైవిధ్యమైన సమ్మిళిత భారతాన్ని రూపొందించుకోవడం కూడా అని తెలిపారు.