మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు ఊపందుకుంటున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ రాత్రి 10 గంటలకు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం కీలకంగా చర్చించనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమావేశం వర్చువల్గానే సాగుతుందని సీఎంవో పేర్కొంది. గురువారం నాటికి మహారాష్ట్రలో 88 ఒమిక్రాన్ కేసులున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగో లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొన్ని రోజుల కిందటే ముఖ్యమంత్రి ఉద్ధవ్కు వెన్నెముక ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన విశ్రాంతిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్కు సంబంధించిన రివ్యూ మీటింగ్లో పాల్గొనడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.