భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Poll Results) బీజేపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకుపోతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అభ్యర్ధి విక్రం మస్తల్ శర్మపై ఏకంగా 1,64,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సెహోర్ జిల్లాలోని బుధ్ని విదిశ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
ఇదే స్ధానం నుంచి పోటీ చేసిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అభ్యర్ధి దినేష్ ఆజాద్ మూడో స్ధానంతో సరిపెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలతో స్వీట్లు పంచుకున్నారు. పార్టీ విజయోత్సవ వేడుకల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇక 233 స్ధానాలు కలిగిన మధ్యప్రదేశ్లో బీజేపీ 163 స్ధానాల్లో ఆధిక్యత సాధించగా కాంగ్రెస్ 66 స్ధానాలకు పరిమితమైంది.
Read More :