ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బిహార్లో ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని, రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కొత్త ప్రత్యామ్నాయం కావాలని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతో పని లేదని, ఆ వ్యాఖ్యలు అంత ప్రాధాన్యమైనవి కావని నితీశ్ కొట్టి పారేశారు. బిహార్కు ఏది మంచిదో, ఏది మంచిది కాదో.. ప్రజలకు తెలుసని అన్నారు. తాము ప్రజలకు మంచి చేశామో లేదో, ప్రజలకు తెలుసని సీఎం వ్యాఖ్యానించారు. ఇతరుల మాటలు ఎంత మాత్రమూ ప్రాధాన్యం కాదని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
బిహార్లో తాము మంచి చేశామో, లేదో ప్రజలకు తెలుసు. ఇతరుల మాటలు ఎంత మాత్రమూ ప్రాధాన్యం కావు. సత్యమే అత్యంత ప్రాధాన్యం. తమ పని విధానం ప్రజలకు బాగా తెలుసు. ఎంత పనిచేశామో, ఏమేమి చేశామో అందరికీ తెలుసు. ఈ విషయంలో మాత్రం మీరే మాట్లాడాలి. ఇతరులు విమర్శలు చేస్తే తామే సమాధానం చెబుతాం. కానీ.. ఈ కేసులో మాత్రం మీరే సమాధానం చెప్పాలి అంటూ సీఎం నితీశ్ పాత్రికేయులతో అన్నారు.