నాగాలాండ్లో కేంద్ర బలగాలు కాల్పులు చేసిన నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్ర పోలీసులకు కీలక సూచన చేశారు. పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో చాలా జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో బీఎఎస్ఎఫ్ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బీఎస్ఎఫ్ కార్యకలాపాలకు నిర్దేశించిన ప్రాంతానికి మించి, ఇతర ప్రాంతాల్లోకి వారి కార్యకలాపాలను అనుమతించవద్దని కరాఖండిగా తెలిపారు. శాంతిభద్రతల అంశాన్ని రాష్ట్ర పరిధిలోనే ఉంచాలన్నారు. ”చెప్పాపెట్టకుండా బీఎస్ఎఫ్ జవాన్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తారు. తమను ఇబ్బందులు పెడుతున్నారని సంబంధిత గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేస్తారు. ఈ విషయం నాకు బాగా తెలుసు. పోలీసులకు చెప్పకుండానే తమ పరిధిని దాటి వెళ్లిపోతుంటారు” అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.