Meghalaya : మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మ కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ ఉన్నా, గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారని, జాతీయ జెండాను ఎగరేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు దూరంగానే వున్నారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఈ నెల 21 న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా సరే.. సంగ్మా గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొని, కోవిడ్ నియమాలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం కోవిడ్ సోకిన వారు ఏడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని నిబంధన విధించారు.