హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో డెలిగేషన్ బృందం, సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన అధికారుల డెలిగేషన్ బృందాలు వెళ్లనున్నాయి. కేంద్ర మంత్రితో పాటు సంబంధిత అధికారులు, ఎఫ్సీఐని ధాన్యం యాసంగి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై స్పష్టత కోసం కలువనున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోదీని కూడా సీఎం కేసీఆర్ సైతం కలిసే అవకాశం ఉన్నది.