ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చెన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, తనపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అయినా ఏ ఒక్కటీ నిలబడలేదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్తో సహా, పలువురు పంజాబ్ను దోచుకోవడానికే వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు. నాపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేశారు. లేనిపోని అభాండాలు వేయాలని చూశారు. అవన్నీ తప్పని తేలాయి. గవర్నర్కు నాపై ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించారు. నిజాలేమిటో బయటికొచ్చాయి. కేజ్రీవాల్తో సహా ఇతరులందరూ పంజాబ్ను దోచుకోవడానికే వస్తున్నారు.’అంటూ ఆరోపించారు. భారత్ను దోచుకోవడానికి ఎలాగైతే ఆంగ్లేయులు వచ్చారో, అలాగే కేజ్రీవాల్తో సహా అవుట్ సైడర్స్ అందరూ పంజాబ్ను దోచుకోవడానికే వచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కానీ వారి స్థానమేమిటో పంజాబ్ ప్రజలు చూపిస్తారని సీఎం చెన్నీ అన్నారు.