అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్పై విమర్శల పర్వం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన మాటలు బీజేపీ, ఆరెస్సెస్ నేతల కామెంట్లలాగా ఉన్నాయని ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ కూడా కపిల్ సిబాల్ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సంస్కృతి ఏమిటో కపిల్ సిబాల్కు తెలియదు. ఆయన పేరు మోసిన అడ్వకేట్. అలా కాంగ్రెస్లోకి వచ్చారు. సోనియా, రాహుల్ ఇద్దరూ ఆయనకు పుష్కలంగా అవకాశాలు ఇచ్చారు. అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి విమర్శలు ఊహించలేదు. ఆయన వ్యవహార శైలి బాగోలేదు అంటూ అశోక్ గెహ్లాత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 సభ్యుడు కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబీకులు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని సూటిగా డిమాండ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛందంగానే వారు తమ పదవుల నుంచి దూరం జరగాలని సిబాల్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే అందరి పార్టీ అని, ఓ ఇంటి పార్టీ మాత్రం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధేయ కుటుంబం లేకుండా పార్టీ మనుగడే కష్టమని కొందరు అంటున్నారని, కాంగ్రెస్ అందరి పార్టీ అని, ఒక కుటుంబ పార్టీ కాదని కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.