న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు. నేరాలను అదుపు చేయలేకపోతే తమకు బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అవినీతిపరులైన మంత్రులను కాపాడుకునేందుకే కేజ్రీవాల్ శాంతిభద్రతలను తమ చేతుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు.