చండీగఢ్, నవంబర్ 5: అవినీతిపై మోదీ సర్కారు పోరాటం ఓ గిమ్మిక్కు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపరులంటూ బీజేపీ విమర్శించిన నేతలు ఆ పార్టీలో చేరగానే సచ్ఛీలురుగా మారిపోతారని, వారికి ఆ పార్టీ మంత్రి పదవులు కట్టబెడుతుందని విమర్శించారు. హర్యానాలోని రోథక్లో జరిగిన ఆప్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా నేత భారీ అక్రమాలు, అవినీతికి పాల్పడి బీజేపీలో కనుక చేరితో సీబీఐ కానీ, ఈడీ కానీ వారి జోలికి రావడానికే భయపడతాయని ఆయన చెప్పారు. అసలు అవినీతి పరులు అంటే ఎవరు? అని ప్రశ్నించిన ఆయన.. ఈడీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన వారు అవినీతి పరులు కాదని, ఎవరైతే అక్రమాలకు పాల్పడి ఈడీకి భయపడి బీజేపీలో చేరుతారో వారే అసలైన అవినీతిపరులని ఆయన విమర్శించారు.