కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై ప్రతిపక్ష నేత సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం బొమ్మై ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని విమర్శించారు. అధిష్ఠానానికి ముడుపులు చెల్లించి, కప్పం కట్టి, సీఎం పదవి తెచ్చుకున్నారని సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
2,500 కోట్లను ఇస్తే, తనకు సీఎం పదవి ఇస్తామని ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ఆశ చూపారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత సిద్దరామయ్య సీఎం బొమ్మైపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బసవరాజ్ బొమ్మై ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. అధిష్ఠానం నియమించిన సీఎం. అందుకే ఆయన ఏమీ చేయడం లేదు. సీఎం కావడానికి ఆయన ముడుపులిచ్చారు. ఆయన ఎందుకు పనిచేస్తారు? ఆరెస్సెస్ ఆయన్ను సీఎం చేసింది. ఆరెస్సెస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తే సరి అంటూ సిద్దరామయ్య ఆరోపించారు.