అది ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ఒక ప్రదేశం.. అక్కడ వారం రోజులుగా భారీ వర్షం కురుస్తున్నది. కొండలపై నుంచి జాలువారే వర్షంనీరు మేఘాల్లా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. మేఘాలయ రాష్ట్రంలో కొండల పక్కన తెల్లటి జలపాతం గర్జన విని నెటిజన్లు అవాక్కవుతున్నారు. మేఘాలయలోని ఖాసీ హిల్స్ తూర్పు భాగంలోని మాసిన్రామ్లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఇది నెట్టింట వైరల్గా మారింది. ఇక్కడ జూన్ 16 ఉదయం 8:30 గంటల వరకు రికార్డు స్థాయిలో 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ వీడియోలో కారులో కూర్చున్న ఒక మహిళ మేఘాలు వస్తున్నాయి అని అంటుంది. ఆ కారులోనే ఉన్న ఓ వ్యక్తి అవి మేఘాలు కాదు..జలపాతం అని చెబుతాడు. వర్షంనీరు కొండపైనుంచి అలా పొంగిపొర్లుతున్నాయని అంటాడు. కారును ముందుకు పోనియొద్దని భయంభయంగా డ్రైవర్ను కోరుతారు. కారు ముందు ప్రదేశంలో రోడ్డు కనిపించకపోవడంతో అక్కడే మరోకారును నిలిపేశారు.
ఈ వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేశారు. తాను ఇంతవరకూ ప్రపంచంలో అత్యంత తేమగా ఉండే ప్రాంతం చిరపుంజీ మాత్రమే అనుకున్నానని, మాసిన్రామ్ అని ఇప్పుడే తెలుసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, ప్రతి ఏటా చిరపుంజీ, మాసిన్రామ్లో గణనీయమైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంటూ.. ఆ రెండు ప్రదేశాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్వీట్ చేశారు.
The wettest place in the world, Mawsynram, India just recorded a mind boggling 39.51 inches (1003.6 mm) of rain in the last 24 hours.
These are what the waterfalls in the area look like. pic.twitter.com/WRktarmMax
— US StormWatch (@US_Stormwatch) June 17, 2022
When I was in school, the answer to ‘What is the wettest place in the world’ was Cherrapunji. Didn’t know Mawsynram is at the top of the podium. The visuals here are amazing… https://t.co/H8Dr7b10Hb
— anand mahindra (@anandmahindra) June 18, 2022