నోయిడా: దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న నోయిడాలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. ప్రస్తుతం అక్కడ వాయు నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉన్నది. దీంతో ప్రజలు ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నోయిడాలోని అన్ని స్కూళ్లను ఈ నెల 8 వరకు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆన్క్లాసులు నిర్వహించాలని విద్యా సంస్థలకు స్పష్టం చేశారు. అలాగే 9 నుంచి 12వ తరగతి వరకు కూడా ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు.
నోయిడా, గ్రేటర్ నోయిడాలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరిందని, త్రీవమైన కేటగిరీలోకి పడిపోయింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. కాలుష్యం వల్ల నగరంలో దట్టంగా పొగకమ్ముకున్నదని వెల్లడించింది. ఈనేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 469కి చేరిందని పేర్కొన్నది.