గాంధీనగర్: గుజరాత్తో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హిందీ పరీక్ష (Hindi paper) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పరీక్ష ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. అదికాస్త విస్తృతంగా షేర్ అయింది. దీంతో పేపర్ లీక్పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కాగా, హిందీ పేపర్ లీక్పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా శాఖ మంత్రి తక్షణ రాజీనామా డిమాండ్ చేసింది. ఇప్పటివరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు మాత్రమే లీకయ్యేవి.. తాజాగా పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్లు ఈ జాబితాలో చేరాయని విమర్శించారు.